సింగిల్ డైలాగ్ తో వ్యూహం టీజర్ : అలా ఆలోచించటానికి చంద్రబాబును కాదు

సింగిల్ డైలాగ్ తో వ్యూహం టీజర్ : అలా ఆలోచించటానికి చంద్రబాబును కాదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మూవీ "వ్యూహం". అనౌన్స్మెంట్ తోనే సంచలనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా నుండి తాజాగా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సింగల్ డైలాగ్ తో టీజర్ ను నెక్స్ట్ లెవల్లో కట్ చేశాడు ఆర్జీవీ. 

 YSRకు జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంతో మొదలైంది ఈ టీజర్. హెలికాఫ్టర్ ప్రమాదం, YSR మరణం, ఆ తర్వాత ఏం జరిగింది, ఎవరు ఎలా రియాక్ట్ అయ్యారు, జగన్ ను కొనడానికి పార్టీ పెద్దలు రావడం, జగన్ ను అరెస్ట్ చేసే సన్నివేశాలు, జగన్ పార్టీ పెట్టడం వంటి సీన్స్ ను కళ్ళకు కట్టినట్టు చూపించాడు రామ్ గోపాల్ వర్మ. ఇక టీజర్ చివర్లో జగన్ చెప్పిన.. నేనలా చేయడానికి చంద్రబాబుని అనుకున్నావా అనే డైలాగ్ టీజర్ కు హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం వ్యూహం టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ టీజర్ చూసిన ఆడియన్స్ ఇలాంటి రియలిస్టిక్ సినిమాలు తీయడంలో నీకు నువ్వే సాటి ఆర్జీవీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరికొందరేమో వ్యూహం టీజర్ ను విమర్శిస్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు తీసుకోవడం కాదు.. నిజాన్ని చూపించే దమ్ముండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్‌, భారతీగా మానస నటించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి టీజర్ తోనే ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. రిలీజ్ తరువాత ఇంకెన్ని సంచలనాలకు కేరాఫ్ గా మారుతుందో చూడాలి.