ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాల రాముడు మారిపోయాడు.. నన్ను నేనే నమ్మకలేకపోయా : శిల్పి యోగిరాజ్

ప్రాణ ప్రతిష్ఠ తర్వాత బాల రాముడు మారిపోయాడు.. నన్ను నేనే నమ్మకలేకపోయా : శిల్పి  యోగిరాజ్

అయోధ్యలో బాల రాముడి ప్రతిష్ఠ తరువాత విగ్రహాన్ని చెక్కిన శిల్పి యోగి రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత నేను చిక్కిన శిల్పం చాలా మారిపోయింది. అసలు నేను చేసిన విగ్రహమేనా అనే డౌట్ వచ్చింది. ప్రాణ ప్రతిష్ట తర్వాత రాముడు మారిపోయాడు అంటూ కామెంట్స్ చేశారు.  ప్రతిష్టాపన తర్వాత రామ్ లల్లా ముఖంలో చిరునవ్వు, కళ్ళలో భావాలు మారిపోయాయి అని శిల్పి యోగిరాజ్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రస్తుతం రాముడికి సంబంధించి ఏ చిన్న అంశమైనా వైరల్ గా మారుతుంది. అందునా బాలరాముడు విగ్రహాన్ని చెక్కిన శిల్పి మాటలు మరింత వైరల్ అవుతున్నాయి. అద్భుతమైన రూపం, చిరు దరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు. అయోధ్య రామ మందిరం, గర్భగుడిలో కొలువైన బాల రాముడు ఫోటోలు సోషల్ మీడియా మారుమోగుతున్నాయి. 

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ కార్యక్రమం దిగ్విజయంగా సాగింది. వేలాది మంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కాగా.. కోట్లాది మంది ప్రత్యేక ప్రసారాల ద్వారా వీక్షించారు. 500 ఏళ్ల నాటి కల సాకారం కావడంతో యావత్ దేశం జైశ్రీరామ్ నినాదంతో మార్మోగిపోయింది. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట వేడుకలు ముగియడంతో.. సామాన్య భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

అద్భుతమైన రూపం, చిరు దరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు. అయోధ్య రామ మందిరం, గర్భగుడిలో కొలువైన బాల రాముడు ఫోటోలతో సోషల్ మీడియా మారుమోగుతోంది . ఈ క్రమంలోనే అనేక రకాల వీడియోలు, ఫోటోలు దర్శనమిస్తున్నాయి.