
ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఆగస్ట్ 15 సందర్బంగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ఆడియన్స్ నుండి మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో డబుల్ ఇస్మార్ట్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
ఏపీ నైజాంలో కలిసి ఫస్ట్ డే డబుల్ ఇస్మార్ట్ మూవీకి రూ.5.20 కోట్ల వరకు కలెక్షన్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. నైజాం ఏరియాలో దాదాపు రెండున్నర కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు చెబుతోన్నారు. డబుల్ ఇస్మార్ట్ అన్ని భాషల్లో కలిపి మొదటి రోజు దాదాపు రూ.7.35 కోట్ల ఇండియా నికర సంపాదించింది.
దాదాపు రూ.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజైన ఈ ఈ మూవీ ఫస్ట్ డే కేవలం ఏడున్నర కోట్లు కలెక్షన్స్ మాత్రమే రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ డే ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోయినప్పటికీ..వీకెండ్ వస్తుండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నాయి ట్రేడ్ వర్గాలు. ఏం జరుగుతుందో చూడాలి.
రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీ ఫస్ట్ డే రూ.5.30 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు సమాచారం.టాలీవుడ్ బాక్సాఫీస్ ఫైట్లో ఫస్ట్ డే రవితేజ మిస్టర్ బచ్చన్పై రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ పైచేయిని సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.