రామగుండంలో రాజీకొచ్చిన మాజీలు : ఎన్నికల్లో పోటీకి దూరం

రామగుండంలో రాజీకొచ్చిన మాజీలు : ఎన్నికల్లో పోటీకి దూరం

గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీకి సై అన్న మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు రాజీకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ అభ్యర్థులకు మద్దతు పలికేందుకు ముందుకు వచ్చారు. 38వ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్​ నుంచి నెలకంటి రాము, మాజీ కార్పొరేటర్​ బొమ్మక శైలజ రాజేశ్​పోటీ పడ్డారు. అయితే అనూహ్యంగా నెలకంటి రాముకు మద్దతుగా నిలుస్తున్నట్టు బొమ్మక రాజేశ్​ ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ సమక్షంలో ప్రకటించారు. 

53వ డివిజన్​లో కాంగ్రెస్​ నుంచి పోటీకి దిగిన గట్ల రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మాజీ కార్పొరేటర్​ ధరణి జలపతి మద్దతు తెలిపారు. 44వ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్​ అభ్యర్థికి మద్దతుగా మాజీ కార్పొరేటర్​ 
పాముకుంట్ల భాస్కర్.. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. మొన్నటి వరకు నామినేషన్​ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న భాస్కర్​ ఒక్కసారిగా సైలంట్​ అయ్యారు. 13వ డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్ఎస్​ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన రాకం వేణు పోటీ నుంచి తప్పుకుని కటుకు ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఇలా రామగుండం కార్పొరేషన్​ పరిధిలో ఎన్నికల వేళ అనూహ్యంగా కొందరు నామినేషన్లు వేయకుండా పోటీ నుంచి తప్పుకున్నారు.