- ఎమ్మెల్యే రాజ్ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి క్యాంప్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ రామగుండంలో తమ పాలనపై ప్రతిపక్ష పార్టీలు లేనిపోని అసత్య ఆరోపణలు, విమర్శలు చేసినా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్నారు. తనపై నమ్మకంతో కాంగ్రెస్ కార్పొరేటర్లను గెలిపించిన వారందరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్లోకి నలుగురు ఏఐఎఫ్బీ కార్పొరేటర్లు...
ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల్లోనే ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(ఏఐఎఫ్బీ) నుంచి గెలిచిన నలుగురు కార్పొరేటర్లు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. అడ్లూరి రవి(3వ డివిజన్), కర్రావుల దాడిరాజు(44వ) , చిదురాల నాగరాజు(52వ), బాలసాని తిరుపతిగౌడ్(59వ) శుక్రవారం రాత్రి కాంగ్రెస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే రాజ్ఠాకూర్ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ నలుగురితో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య చేరికతో రామగుండం కార్పొరేషన్లో కాంగ్రెస్ బలం 43కు చేరింది. సింహం గుర్తుపై ఆరుగురు గెలవగా అందులో నలుగురి చేరికతో ఆ పార్టీలో ఇద్దరే మిగిలారు.
