సహస్రాబ్ది ఉత్సవాలు..ఇవాళ మహా పూర్ణాహుతి

 సహస్రాబ్ది ఉత్సవాలు..ఇవాళ మహా పూర్ణాహుతి

ముచ్చింతల్ లో జరుగుతున్న  సమతామూర్తి  రామానుజాచార్య   సహస్రాబ్ది ఉత్సవాలు ఈ రోజుతో  ముగియనున్నాయి. చివరి రోజు  మహాపూర్ణాహుతి   జరుగనుంది. ఈ నెల 2న ప్రారంభమైన వేడుకలు  12 రోజులపాటు  వైభవంగా సాగాయి. కాసేపట్లో  సహస్ర కుండలాల యజ్ఞానికి   మహాపూర్ణాహుతి  పలుకనున్నారు. 108  దివ్య దేశాల్లోని  ఆలయాల మూర్తులకు  శాంతి కల్యాణం  నిర్వహించనున్నారు.  సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సీతారాముల   కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.  ఈ కార్యక్రమాలకు  సీఎం కేసీఆర్ తో పాటు  క్యాబినెట్ మంత్రులు  హాజరవుతారని తెలుస్తోంది.