రామాయంపేట, వెలుగు: మెదక్జిల్లా రామాయంపేటలో కిరాయికి ఉంటున్న వ్యక్తి చనిపోతే శవాన్ని ఓనర్ ఇంట్లోకి తేనియ్యలేదు. దీంతో నేరుగా శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. మృతుడి బంధువుల కథనం ప్రకారం... శివాయిపల్లికి చెందిన శ్రీనివాస్చారి (45) కుటుంబంతో కలిసి ఆరో వార్డులోని చాకలి బస్తీలో కిరాయికి ఉంటున్నాడు. స్వర్ణకార వృత్తి చేసుకునే చారి అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాద్ లోని ఓ హాస్పిటల్కు తీసుకుపోయారు.
అక్కడ ట్రీట్ మెంట్ పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. దీంతో కుటుంసభ్యులు అతడి డెడ్ బాడీని రామాయంపేటకు తీసుకు రాగా, ఇంటి ఓనర్ ఇంట్లోకి రానియ్యలేదు. మరో దారిలేక స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద శవాన్ని ఉంచి ఆదివారం అక్కడి నుంచే శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.