Tv Serial Ramayan: 650 మిలియన్ల వ్యూస్..విదేశాల్లో మార్మోగిన టీవీ సీరియల్

Tv Serial Ramayan: 650 మిలియన్ల వ్యూస్..విదేశాల్లో మార్మోగిన టీవీ సీరియల్

దేశ విదేశాల్లో మార్మోగిన టీవీ సీరియల్ ‘రామాయణ్​’. 1987–88లో దూరదర్శన్లో ప్రసారమైన రామాయణ్ సీరియల్ చాలా ఫేమస్. ఉదయం 9 గంటలైందంటే చాలు జనం టీవీలకు అతుక్కుపోయే వారు. ఈ సీరియల్ ను అలోక్ కుమార్ రచించగా శ్రీరాముడి  పాత్రలో రామాయణం అరుణ్ గోవిల్, సీతాదేవిగా దీపికా చికిలియా, లక్ష్మణుడిగా సునీల్ నటించారు.

ఈ సీరియల్ జనం హృదయాల్లో పదిలంగా ఉంది. ఇవాళ జరిగే కార్యక్రమంలో అలనాటి సీత, రామ, లక్ష్మణ పాత్రధారులుగా ఉన్న దీపికా చికిలియా,అరుణ్ గోవిల్,సునీల్ హాజరయ్యారు. రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన ఈ సీరియల్ ఆ తర్వాత మరోసారి రీ టెలికాస్ట్ అయ్యింది.

17 దేశాల్లో 20 చానెళ్లలో ప్రసారం చేయగా 650 మిలియన్ల మంది వీక్షించారు. అంతేకాదు ఈ సీరియల్ లో గల ప్రతీ ఎపిసోడ్ ద్వారా దూరదర్శన్‌కు రూ.40 లక్షల ఆదాయం వచ్చిందని బీబీసీ చెబుతోంది.