కేంద్రం 5 లక్షల కోట్లిచ్చింది: చింతల రాంచంద్రారెడ్డి

కేంద్రం 5 లక్షల కోట్లిచ్చింది: చింతల రాంచంద్రారెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని, నేషనల్ హైవేల విస్తరణకే లక్ష కోట్లకు పైగా ఇచ్చిందని బీజేపీ సీనియర్​ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. తొమ్మిదేండ్లలో కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం వైట్​ పేపర్ ​రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో ప్రజలకు ఈ వివరాలు అన్ని తెలియజేస్తున్నామని, ఈ లెక్కలు విని వారు ఆశ్చర్యపోతున్నారన్నారు. 

పటాన్‌‌చెరు ఎమ్మెల్యే కబ్జాలపై బుల్డోజర్ దింపుతం: నందీశ్వర్ గౌడ్ 

పటాన్‌‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో నందీశ్వర్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిపాల్ రెడ్డి అవినీతి, అక్రమాలపై బుల్డోజర్ దింపుతామని హెచ్చరించారు.  మహిపాల్ రెడ్డి చేసే కబ్జాల్లో ప్రభుత్వ పెద్దలకు కూడా వాటాలు అందుతున్నాయని నందీశ్వర్ గౌడ్ ఆరోపించారు.