సిద్దిపేట మున్సిపాలిటీని సందర్శించిన కర్నాటక బృందం

సిద్దిపేట మున్సిపాలిటీని సందర్శించిన కర్నాటక బృందం

సిద్దిపేట టౌన్, వెలుగు: కర్నాటక స్టేట్ లోని రామ్ దుర్గ్ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు శనివారం సిద్దిపేటలో పర్యటించారు. పట్టణంలో ఉన్న స్వచ్ఛ బడితో పాటు, రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో ఉన్న బయో సీఎన్ జీ  ప్లాంట్ ను సందర్శించారు. 

స్వచ్ఛ బడిలో వారికి సిద్దిపేట మున్సిపల్ అధికారులు డ్రై వేస్ట్ తయారీపై అవగహన కల్పించారు. బస్సాపూర్ డంప్ యార్డ్ లో జరిగే బయో సీఎన్ జీ అండ్ ఆర్గానిక్ ప్లంట్ లో వేస్ట్ ప్రాసెస్ గురించి వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ పాల్గొన్నారు