10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు ఇవ్వాలె

10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు ఇవ్వాలె
  • మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్ బాబు

ముషీరాబాద్,వెలుగు: మాలలు రాజకీయంగా ఎదగడానికి అన్నిరాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోపోజు రమేశ్​బాబు డిమాండ్ చేశారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో మాలలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని వివిధ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్​బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాలలకు 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలు కేటాయించాలని ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. 

ప్రభుత్వ పదవుల్లోనూ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో కొండ్ర రాజలింగం, మల్లెల వెంకట్రావు, వల్లిక కృష్ణమూర్తి, నర్సింగరావు, శ్రవణ్ కుమార్, శ్రీధర్ రావు, రాందాస్, కోటేశ్వరరావు, అశోక్, నగేశ్​ పాల్గొన్నారు.