మియాపూర్, వెలుగు: అధిక లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ పేలి పక్కనే నిలిపి ఉంచిన వాహనాలు మంటల్లో దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, హఫీజ్పేట్ మార్తాండనగర్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ సోమవారం అర్ధరాత్రి హెవీ లోడ్ను తట్టుకోలేక భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలింది.
ఈ ప్రమాదంలో ట్రాన్స్ఫార్మర్ సమీపంలో పార్క్ చేసి ఉంచిన ఒక టాటా ఏస్ వాహనం, రెండు బైకులు మంటల్లో కాలిపోయాయి. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో మార్తాండనగర్ ప్రాంతంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
