హైదరాబాద్ లోని అబిడ్స్ లో హైటెక్ సెక్స్ రాకెట్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అబిడ్స్ ఫార్చూన్ హోటల్లో సలువడి అఖిల్ పహిల్వాన్ ఆధ్వర్యంలో ఈ వ్యభిచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది. 16 మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా 25 రోజులుగా అమ్మాయిలు హోటల్లో ఉంటున్నారు.
ఫార్చ్యూన్ హోటల్ లో 25 రూములలో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టాస్క్ పోర్స్ తనిఖీల్లో 16 మంది అమ్మాయిలను ఆరుగురు కస్టమర్లను ఇద్దరు ఆర్గనైజర్లను పోలీసులు పట్టుకున్నారు. 22 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అఖిల్ పహిల్వాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
పోలీసుల విచారణలో కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. అఖిల్ పహిల్వాన్ కు సినీ ప్రముఖులకు అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డును పోలీసులు బయటకు తీశారు. అఖిలేష్ మొబైల్ ఫోన్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు గుర్తించారు. రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్లు తేలింది. ఈ కేసులో సలువడి అఖిలేష్, పక్కల రఘుపతి, అభిషేక్ బాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖలీద్, సంతోష్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.