హైడ్రాకు ప్రజల సహకారం కావాలి: రంగనాథ్

హైడ్రాకు ప్రజల సహకారం కావాలి: రంగనాథ్

కూకట్​పల్లి, వెలుగు: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సోమవారం జేఎన్టీయూలో ‘జలం, లింగ సమానత్వం’ అనే అంశంపై సదస్సు జరిగింది. దీనికి హైడ్రా కమిషనర్​రంగనాథ్​చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడారు. అర్బనైజేషన్​వేగంగా జరుగుతుండడంతో భూ వనరులపై ఒత్తిడి పెరిగి చెరువులు, కుంటలు కాలుష్యం బారిన పడ్డాయన్నారు.

 తాము చేస్తున్న ప్రయత్నానికి ప్రజల సహకారం కావాలన్నారు. గౌరవ అతిథిగా టి. కిషన్​కుమార్​రెడ్డి హాజరై మాట్లాడుతూ జల రక్షణ, లింగ సమానత్వం అనే అంశాలు నేటి పరిస్థితులకు అవసరమైన ముఖ్యాంశాలన్నారు. మహిళల సాధికారత కోసం వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. జి గ్రూప్​హెడ్​డాక్టర్​ పి.మంజుశ్రీ జల వనరుల నిర్వహణ కోసం ఏఐ ఆధారిత భూ పరిశీలన అనే అంశంపై మాట్లాడారు. యూసీఈఎస్టీహెచ్​ప్రిన్సిపాల్​డాక్టర్​ జి.వి.నరసింహారెడ్డి, ప్రొఫెసర్​ వి.హిమబిందు, డాక్టర్​ కె.మృత్యుజయరెడ్డి, డాక్టర్​ టి.విజయలక్ష్మి పాల్గొన్నారు.