ఎల్బీనగర్, వెలుగు: బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన కోడిగంటి కృష్ణ(25) ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. 2017లో స్థానికంగా ఉండే ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను కిడ్నాప్ చేశాడు. తిరుపతికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
కొన్నిరోజుల తర్వాత బాధితురాలిని కందుకూరులో వదిలి వెళ్లాడు. బాలిక కుటుంబసభ్యుల కంప్లయింట్తో పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బుధవారం కేసు విచారణలో భాగంగా ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా 9వ ఏడీజే కోర్టు.. కృష్ణకు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.30 వేల ఫైన్ విధిస్తూ తీర్పు వెలువరించింది.