
బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్(Ranveer Singh), దీపికా పదుకొణె(Deepika Padukone) ముంబైలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. దీని విలువ ఏకంగా రూ.100 కోట్లు కావడం విశేషం. ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో ఉన్న ఈ ఇంటి నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది.
సముద్రానికి అభిముఖంగా ఉన్న క్వాడ్రాప్లెక్స్ అపార్ట్మెంట్ ఇది. ఏకంగా 11266 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఆ బిల్డింగ్ లోని 16 నుంచి 19వ అంతస్తు వరకు ఉండటం విశేషం. ఈ కొత్త అపార్ట్మెంట్ కింగ్ షారుఖ్ ఖాన్ నివాసం మన్నత్కు ఆనుకుని ఉంది.
ఈ సెప్టెంబరులో దీపికా తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ అపార్ట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వారి కొత్త ఇంటికి మారాలని భావిస్తున్నట్లు సమాచారం. మూడేళ్ల కిందట అలీబాగ్ లోనూ ఈ జంట రూ.22 కోట్లతో ఓ బంగ్లా తీసుకున్న విషయం. రణ్వీర్ సింగ్, దీపికా 2018లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
దీపికా పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అతి తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ. పాన్ ఇండియా కమర్షియల్ సినిమాలకు కేరాఫ్గా మారిపోయింది.రీసెంట్ గా ప్రభాస్ కల్కి 2898 AD లో నటించిన దీపికా పదుకొణె హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఒకరు.