
కరోనా వైరస్ ( కోవిడ్ -19 ) ను కట్టడి చేయడానికి ‘ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్’ను రూపొందించినట్టు తెలిపింది భారత కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ ( ICMR ). అయితే ఈ ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ను దేశంలోని పలుచోట్ల ప్రయోగాత్మకంగా రిలీజ్ చేశామని తెలిపింది. ఈ టెస్ట్ కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఇమ్యునిటీ సిస్టమ్ను సరిచేయడానికి మాత్రమే ఉపయేగపడుతుందని చెప్పింది. దీంతో పాటు వైరస్ సోకిన వ్యాధిగ్రస్తునిలోని ప్రస్తుత సిచ్యువేషన్ను తెలియచేస్తుందని తెలిపింది.
‘ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్’ మోస్ట్ ఎఫెక్టివ్ టూల్ గా కరోనా వైరస్పై పని చేస్తుందని అన్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వారిపై ఈ టూల్ను ప్రయోగిస్తున్నట్లు చెప్పారు. మరో రెండు మూడు రోజుల్లో రిజల్ట్ తెలిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే కరోనా సోకిన వారిలో యువకులకు అంతగా వ్యాధి తీవ్రత లేనప్పటికీ వయసుమీరిన వారిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని అన్నారు. ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ ను సర్జికల్ టెస్ట్ అని కూడా అంటారని డాక్టర్లు చెప్పారు. దీంట్లో బ్లడ్ సాంపిల్స్ తీసుకుని వైరస్ ఉందా లేదా అని కూడా నిర్ధారణ చేస్తారని తెలిపారు.