Eagle Movie: రవితేజ ఈగల్ టికెట్ ధర..ప్రొడ్యూసర్స్ డేరింగ్ డెసిషన్!

Eagle Movie: రవితేజ ఈగల్ టికెట్ ధర..ప్రొడ్యూసర్స్ డేరింగ్ డెసిషన్!

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌తో వస్తోన్న మాస్ రాజా రవితేజ (Ravi Teja) ఈగల్ (Eagle) మరో రెండ్రోజుల్లో (ఫిబ్రవరి 9న) ఆడియన్స్ ముందుకు రాబోతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల నిర్మించిన ఈ సినిమాకు కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని దర్శకత్వం వహించాడు. రవితేజకు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ నటించారు.

మాస్ రాజా నుంచి వస్తోన్న స్పై థ్రిల్ల‌ర్‌ ఫిల్మ్ కావడమే కాకుండా..టీజర్ ట్రైలర్లో చూపించిన ఎలిమెంట్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. దాదాపు రూ. 80 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి..టికెట్ల రేట్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 

రూ. 80 కోట్ల సినిమా అంటే..పెద్ద సినిమా అన్నట్టే. మరి అలాంటి పెద్ద సినిమాలకు టికెట్ల రేట్స్‌ కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. అంతేకాదు..ఫస్ట్ డే బుకింగ్స్ కూడా దొరకడం కష్టమే. ఇక పెద్ద సినిమాలు థియటర్స్ లోకి వచ్చినప్పుడు..సినిమా బడ్జెట్‌ ఆధారంగా మేకర్స్‌ టికెట్‌ రేట్లు పెంచేస్తుంటారు. అలాగే పెద్ద హీరోల సినిమాలకు ప్రభుత్వాలు సైతం టికెట్ల రేట్ పెంచుకునేందుకు సడలింపులు కూడా ఇస్తాయి.

కానీ ఈగల్ మూవీ మేకర్స్ మాత్రం ఊహించని డెసిషన్ తీసుకున్నారు. రవితేజ ఈగల్ మూవీ టికెట్లను మామూలు రోజుల్లో ఆడియన్స్ చూసే ధరలకే అందుబాటులో ఉంచారు. ఆ విధంగా చూసుకుంటే..హైదరాబాద్‌లోని మల్టీప్లెక్స్‌ థియేటర్లో టికెట్ ధర రూ.200, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లలో రూ.150కే పరిమితం చేశారు. ఇక అత్యధికంగా AMB మల్లీప్లెక్స్‌లలో చూసుకుంటే మాత్రం టికెట్‌ ధర రూ.295 వరకు ఉంది. 

రూ.80 కోట్లతో తెరకెక్కిన ఈగల్ సినిమాకు..మామూలు రోజుల్లో ఉండే టికెట్ల ధరలను ఉంచడానికి ప్రధాన కారణం ఏంటంటే.. ఈగల్ సినిమాను ఎక్కువమంది చూడాలనే ఉద్దేశంతో ప్రొడ్యూసర్స్ ఈ డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం. అలాగే ఫిబ్రవరి, మార్చి నెలలో స్టూడెంట్స్కి పరీక్షల సమయం కూడా దగ్గర పడుతుండటంతో..చాలా తక్కువ మంది సినిమాలను చూస్తారు. ఈ సినిమా కంటెంట్ మీద బాగా నమ్మకం ఉండటంతో నిర్మాతలు డేరింగ్ స్టెప్ వేసినట్లు తెలుస్తోంది ఏదేమైనా సినిమా రిలీజ్ అయ్యాక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వచ్చే కలెక్షన్స్ను ఎవ్వరూ ఆపలేరు. 

ఇప్పటికే ఈగల్ మూవీ బుకింగ్స్‌ స్టార్ట్ అయ్యాయి. రవితేజ కెరీర్ లో చాలా విభిన్నమైన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ తో అయిన హిట్ పడుతుందో..లేదో చూడాలి.ఈ సినిమాలో నవదీప్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా రేపు (ఫిబ్రవరి 8న) USA లో ఈగల్ ప్రీమియర్ షోస్ పడనున్నాయి.