రవితేజ, హరీష్ శంకర్ మూవీ అప్డేట్.. కరైకుడికి మిస్టర్ బచ్చన్

రవితేజ, హరీష్ శంకర్ మూవీ అప్డేట్.. కరైకుడికి మిస్టర్ బచ్చన్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar), మాస్ మహారాజా రవితేజ(Raci Teja)తో చేస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mister Bachhan). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కి రీమేక్ గా వస్తున్న ఈ ప్రాజెక్టు ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. అనూహ్యంగా సెట్ ఐన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. 

తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం టీం కరైకుడికి బయల్దేరింది. అక్కడే సినిమాకు సంబందించిన కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు యూనిట్. దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు చిత్ర యూనిట్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంకా బోస్ కెమెరా బాధ్యతలు చేపట్టారు. 

ఇక మిస్టర్ బచ్చన్ కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఐటీ రైడ్స్ చుట్టూ తిరుగుతుంది. ఐటీ రైడ్స్ లో భాగంగా ఒక బిగ్ షాట్ ఇంటికి వెళ్లిన హీరో.. అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదిరికొన్నాడు. వాటిని అధిగమించి తన డ్యూటీ ఎలా పూర్తిచేశాడు. అనే కథతో మిస్టర్ బచ్చన్ సినిమా రానుంది.  మరి బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.