కరైకుడిలో మిస్టర్ బచ్చన్

కరైకుడిలో మిస్టర్ బచ్చన్

‘ఈగల్’ చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకొస్తున్న రవితేజ.. మరోవైపు తన కొత్త చిత్రం ‘మిస్టర్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌’ షూటింగ్‌‌‌‌తో బిజీగా ఉన్నారు. ఆయన హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం  రెగ్యులర్ షూటింగ్ కొద్దిరోజుల క్రితం మొదలైన విషయం తెలిసిందే. గురువారం నుంచి ఈ మూవీ షూటింగ్ కరైకుడిలో జరుగుతోంది. కరైకుడి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.

బుధవారం అక్కడకు చేరుకున్న రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ ఇందుకు సంబంధించిన ఫొటోస్‌‌‌‌ను సోషల్‌‌‌‌ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పనోరమా స్టూడియోస్,  టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.