పులుల్ని వేటాడే పులి.. సరికొత్తగా రవితేజ

పులుల్ని వేటాడే పులి.. సరికొత్తగా రవితేజ

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న  లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వరరావు. రవితేజ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా రానున్న  ఈ సినిమా నుండి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. 

ఐదు భాషల్లో ఐదుగురు స్టార్ హీరోలు ఈ ఫస్ట్ లుక్ ను రివీల్ చేయడమే కాకుండా.. ఫస్ట్ గ్లింప్స్ కు వాయిస్ కూడా అందించారు. తెలుగులో వెంకటేష్.. తమిళ్ కు కార్తీ, మలయాళం కోసం దుల్కర్ సల్మాన్, కన్నడ శివ రాజ్ కుమార్, హిందీకి జాన్ అబ్రహం వాయిస్ లు అందించారు. టైటిల్ ఫస్ట్ లుక్ లో రవితేజ నెక్స్ట్ లెవల్లో ఉన్నాడు. పులి నుంచి రవితేజ రూపం గా మారిన ఫస్ట్ లుక్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. 

ఇక " జింకలను వేటాడిన పులిని చూసి ఉంటావ్. పులులను వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా..? ” అని రవితేజ చెప్పిన  పవర్ ఫుల్ డైలాగ్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మొత్తంగా గజదొంగ టైగర్ నాగేశ్వరరావు గా రవితేజ లుక్ అదిరిపోయింది. ఈ ఒక్క ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకున్నాయి. మరి ఈ సినిమా రవితేజ కు ఎలాంటి రిజల్ట్ ను తీసుకొస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.