షాకింగ్.. చిరిగిన నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసా..?

షాకింగ్.. చిరిగిన నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసా..?

RBI News: ప్రస్తుతం భారతదేశంలో భౌతికంగా డబ్బు వినియోగం చాలా వరకు తగ్గింది. దీనికి కారణం దేశంలోని మారుమూలలకు సైతం ఇంటర్నెట్ అందుబాటులోకి రావటంతో సూపర్ సక్సెస్ అయిన యూపీఐ సహా మరిన్ని డిజిటల్ చెల్లింపు వ్యవస్థలే. అయితే ఇప్పటికీ చాలా చోట్ల డబ్బు వినియోగం కొనసాగుతూనే ఉంది. 

ప్రస్తుతం డబ్బు వినియోగం తగ్గినప్పటికీ చిరిగిన నోట్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా చిరిగిన, బాగా నలిగిన లేదా పాడైన కరెన్సీ నోట్లను రిజర్వు బ్యాంక్ వెనక్కి తెప్పించుకుంటూనే ఉంది. అయితే దీనిని రిజర్వు బ్యాంక్ ఏం చేస్తుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 

పాడైన కరెన్సీ నోట్లను పర్యావణానికి హాని కలగకుండా చూస్తేందుకు ఆర్బీఐ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వాటిని చెక్క బోర్డులు తయారు చేసేందుకు ఉపయోగిస్తోంది. దేశంలో ప్రతి ఏటా ఇలా పాడైన నోట్ల వల్ల ఏర్పడే స్కాప్ 15వేల టన్నులని రిజర్వు బ్యాంక్ 2024-25 వార్షిక నివేదికల స్పష్టం చేసింది. చాలా సెంట్రల్ బ్యాంకులు పాడైన నోట్లను చెత్తకుప్పలుగా వేయటం లేదా ఇంధనంగా వాడుతుంటాయి. అయితే రిజర్వు బ్యాంక్ దీనికి భిన్నంగా వ్యవహరించటం పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని చేస్తున్న పని. 

పెరిగిన నోట్ల ముద్రణ వ్యయం..
2024-25 ఆర్థిక సంవత్సరంలో కరెన్సీ నోట్ల ముద్రణ వ్యయం గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 25 శాతం పెరిగి రూ.6,372.8 కోట్లకు చేరుకుందని తెలిపింది రిజర్వు బ్యాంక్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈ ఖర్చు రూ.5,101.4 కోట్లుగా ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చెలామణిలో ఉన్న నోట్ల విలువ, వాటి పరిమాణం 6 శాతం వరకు పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ తన నివేదికలో స్పష్టం చేసింది.  

అందుబాటులో ఉన్న ప్రస్తుత  డేటా ప్రకారం 15 నుంచి 29 ఏళ్ల మధ్య వ్యక్తులు ఎక్కువగా యూపీఐ లావాదేవీలను చేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ పేర్కొంది. దాదాపు 99.5 శాతం మంది UPI ద్వారా ఆన్‌లైన్ బ్యాంకింగ్ లావాదేవీలను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడైంది. స్మార్ట్ ఫోన్ ప్రభంజనం దీనికి కారణంగా నిలిచింది.