IPL 2024: ఎమర్జెన్సీ సాకుతో ఐపీఎల్ మ్యాచ్‌కు.. స్క్రీన్‌పై బాస్‌కు చూపించిన కెమెరామెన్

IPL 2024: ఎమర్జెన్సీ సాకుతో ఐపీఎల్ మ్యాచ్‌కు.. స్క్రీన్‌పై బాస్‌కు చూపించిన కెమెరామెన్

ఐపీఎల్ 2024 టోర్నీ జరుగుతుండడంతో దేశమంతా అదే చర్చ నడుస్తోంది. సాయంత్రం అయ్యిందంటే చాలు.. అవకాశం ఉన్నవారు స్టేడియాలకు పరుగెడుతుంటే, అవకాశం లేనివారు టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ మక్కువే ఓ క్రికెట్ అభిమానికి తలవంపులు తెచ్చిపెట్టింది. 

ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని సాకుగా చెప్పి ఓ ఆర్‌సీబీ మహిళా అభిమాని ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కు హాజరైంది. ఇది తెలియని కెమెరామెన్.. స్టేడియంలో ఆమె చేస్తున్న హంగామాను తన కెమెరాలో బంధించాడు. ఇంకేముంది..! అదే సమయంలో ఇంట్లో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్  వీక్షిస్తున్న బాస్(మహిళ).. ఆమెను స్క్రీన్‌పై గుర్తుపట్టింది. సరేలా..! ఎంజాయ్ చేయని అనుకున్న సదరు బాస్.. మరుసటి రోజు ఆమె ఫోన్ కు టెక్స్ట్ పంపారు. ఆమె రియాక్షన్‌ని టీవీలో చూశామని సందేశంలో వివరించారు.

బాస్ కు తాను చెప్పిన ఫ్యామిలీ ఎమర్జెన్సీ స్టోరీని, స్క్రీన్‌పై కనిపించిన దృశ్యాలను, వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను సదరు మహిళా అభిమాని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో వీరి సరదా సన్నివేశం నెట్టింట వైరల్ అవుతోంది.