ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ

 ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ

హైదరాబాద్: ఉప్పల్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసాల చిట్ట వెలుగులోకి వచ్చింది. అమాయకులనుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసి ఉడాయించారని బాధితులు ఫిర్యాదు చేయడంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.  ఉప్పల్ కు జేవీ బిల్డర్స్ వేలూరి లక్ష్మీనారాయణ, జ్యోతిలు బాధితులనుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. బాధితులు డబ్బులు అడగడంతో పారిపోయారు. దీంతో ఆందోళన చెందిన బాధితులు వీరిపై ఉప్పల్ పీఎస్ లో చీటింగ్ కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..లక్ష్మీనారాయణ, జ్యోతిలకోసం గాలిస్తున్నారు.