ఆర్థిక లావాదేవీలతో నరికి చంపిన బావమరిది
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఓ రియల్టర్దారుణ హత్యకు గురయ్యాడు. సొంత బావమరిదే గొడ్డలితో నరికి చంపాడు. కడమంచి నారాయణ్దాస్ (48) చేవెళ్లలో రియల్ఎస్టేట్వ్యాపారి. మంగళవారం రాత్రి 8 గంటలకు మేనత్త కొడుకైన తూర్పటి భాస్కర్(42) తో కలిసి ఊరెళ్ల గ్రామ సమీపంలోని తన పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగారు.
ఈ క్రమంలో భూవ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలపై వాగ్వాదం జరిగింది. మాటామాట పెరిగి భాస్కర్ గొడ్డలితో నారాయణ్దాస్ ను నరికి చంపాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్కు చేరుకొని డెడ్బాడీని ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. నిందితుడు భాస్కర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు.
హత్యపై పలు అనుమానాలు
నారాయణ్దాస్మర్డర్పై బంధువులు, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హత్య వెనుక భాస్కర్ తోపాటు మరికొందరు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భాస్కర్ఎప్పుడూ నారాయణ్దాస్వెంటే ఉంటాడని, అతను చంపేశాడంటే నమ్మశక్యంగా లేదని బంధువులు చెప్తున్నారు. భాస్కర్కు ఎవరైనా సుపారీ ఇచ్చి చంపించి ఉంటారని భావిస్తున్నారు. అయితే భాస్కర్, నారాయణ్దాస్మధ్య ఆర్థిక లావాదేవీల్లో గొడవలు ఉన్నాయని, భాస్కర్కు దాదాపు రూ.25లక్షలు ఇవ్వాలని తెలుస్తోంది.
దీంతో పోలీసులు వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. కాగా, నారాయణ్దాస్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య మణెమ్మ గవర్నమెంట్టీచర్గా పనిచేస్తున్నారు. నారాయణ్దాస్ గతంలో జర్నలిస్ట్గా పనిచేశాడు. అంబేద్కరిస్ట్గా స్థానికంగా పేరుంది. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్(టఫ్)లోనూ కీలకంగా పనిచేశాడు.