చనిపోయిన వ్యక్తికి బూస్టర్ వేశారట!

చనిపోయిన వ్యక్తికి బూస్టర్ వేశారట!

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్​ వేసినట్లు రికార్డుల్లో నమోదు కావడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కొత్తగూడెం పట్టణం న్యూ గొల్లగూడెం ప్రాంతానికి చెందిన కొత్త మల్లారెడ్డి(73) ఈ నెల 11న అనారోగ్యంతో చనిపోయారు. ఆయనకు బుధవారం బూస్టర్ డోస్ వేసినట్లు మెసేజ్ రావడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఓవర్ లుక్ వల్ల చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్ వేసినట్లుగా రికార్డులో నమోదైందని హెల్త్ ఆఫీసర్ పేర్కొన్నారు.