
ఇబ్రహీంపట్నం, వెలుగు: చోరీ కేసుల్లో రికవరీ శాతాన్ని పెంచాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. డ్రగ్స్ కేసుల్లో సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయాలన్నారు. ఎన్బీడబ్ల్యూ కేసులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అనంతరం మంచాల మండలంలో బోడకొండ- చెన్నారెడ్డిగూడ జలపాతాన్ని సందర్శించి భద్రతా చర్యలపై సూచనలు చేశారు.