పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ కొనసాగించాలంటూ డాక్యుమెంట్ రైటర్లు ధర్నా

పాత పద్ధతిలోనే  రిజిస్ట్రేషన్ కొనసాగించాలంటూ డాక్యుమెంట్ రైటర్లు ధర్నా

హైద‌రాబాద్‌: నూతన రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లోని రంగారెడ్డి రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు డాక్యుమెంట్ రైటర్లు. ప్ర‌స్తుతం చేస్తున్న రిజిస్ట్రేషన్ విధానంలో డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం లేకుండానే రిజిస్ట్రేషన్ జరుగుతుందని చదువుకున్న వారికి ఉపయోగకరంగానే ఉన్నా చదువురాని వారి పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నించారు. రంగారెడ్డి రిజిస్టర్ కార్యాలయం లోనూ 6స్లాట్స్ బుకింగ్ అవగా రిజిస్ట్రేషన్ కావడానికి 12 గంటల సమయం పట్టిందని వారు తెలిపారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని డాక్యుమెంట్ రైటర్లను, ప్రభుత్వ అధికారులను ఇబ్బందికి గురి చేయకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పాత పద్ధతిలోనే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.