సాయి రోనక్, గనవి లక్ష్మణ్ జంటగా, రాజేంద్ర ప్రసాద్ కీలకపాత్రలో రమేష్ చెప్పాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘లగ్గం’. వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ ఓపెనింగ్తో పాటు రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించారు.
‘విందు భోజనం లాంటి ఈ సినిమాలో ‘పెళ్లిపుస్తకం’ తరహా గొప్ప పాత్రను పోషిస్తున్నానని, మర్చిపోలేని పాత్ర అవుతుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలంగాణ పెళ్లి కల్చర్తో పాటు ప్రతి ఒక్కరికీ తమ పెళ్లిని గుర్తు చేస్తుంది’ అని సాయిరోనక్ అన్నాడు. రమేష్ చెప్పాల మాట్లాడుతూ ‘పెళ్లి అంటే రెండు కుటుంబాలు కలవడం కాదు.. రెండు మనసులు కలవడం. ఈ సినిమాతో గట్టి దావత్ ఇవ్వబోతున్నాం’ అన్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నాడు.