ఫీజు రీయింబర్స్​మెంట్ రిలీజ్ చేయండి

ఫీజు రీయింబర్స్​మెంట్ రిలీజ్ చేయండి
  •      ప్రభుత్వ ముఖ్య సలహాదారు నరేందర్ రెడ్డికి మేనేజ్ మెంట్ల వినతి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పీజీ కాలేజీల్లో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ ను రిలీజ్ చేయాలని ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కాలేజీల మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ (టీపీడీపీఎంఏ) ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిని సంఘం నేతలు కలిసి వినతిపత్రం అందించారు. 

పెండింగ్ లోని రూ.600 కోట్లకు చెందిన టోకెన్స్ రిలీజ్ చేయించాలని కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పెండింగ్ టోకెన్స్ దశల వారీగా క్లీయర్ చేయిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో టీపీడీఏంఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొజ్జ సూర్యనారాయణ రెడ్డి, యాద రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పరమేశ్వర్, ట్రెజరర్ శంకర్, వైస్ ప్రెసిడెంట్ జైపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.