నల్గొండ జిల్లా : తీవ్ర కొరత ఉన్న రేమిడిసివర్ ఇంజెక్షన్ల బ్లాక్ మార్కెట్ దందా గుట్టును నల్లగొండ జిల్లా పోలీసులు ఛేదించారు. మిర్యాలగూడ కేంద్రంగా శ్రీ సూర్యా ఆసుపత్రి అడ్డాగా సాగుతున్న వ్యాపారానికి బ్రేక్ వేశారు జిల్లా పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలను సోమవారం డిఐజి రంగనాధ్ తెలియజేశారు. నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ సూర్యా ఆసుపత్రిపై రెండు రోజుల క్రితం దాడులు చేసిన పోలీసులు.. భారీ సంఖ్యలో రేమిడిసివర్ ఇంజెక్షన్లను సీజ్ చేశారు. పోలీసులు అసలు ఎక్కడి నుండి తీసుకువస్తున్నారనే కోణంలో విచారణ చేసి బ్లాక్ దందాకు అడ్డుకట్ట వేశారు. మిర్యాలగూడకు చెందిన బాలకృష్ణ హైదరాబాద్ హెటిరో కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే అతని చిన్ననాటి స్నేహితుడు మిర్యాలగూడ పరిధిలోని శాఖపాలెంకు చెందిన గణపతి రెడ్డి క్యూ ల్యాబ్ పేరుతో హైదరాబాద్ లో వ్యాపారం నిర్వహిస్తున్నట్లు రంగనాధ్ చెప్పారు. హెటిరో కంపెనీ మేనేజర్ గా పని చేస్తున్న బాలకృష్ణ.. హైదరాబాద్, ఉప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీ లక్ష్మీ ఏజెన్సిస్ కు 3,000 రూపాయలకు ఒక బాటిల్ చొప్పున సరఫరా చేస్తున్నాడు. అక్కడి నుండి అతని స్నేహితుడు బాలకృష్ణ ఒక్కో బాటిల్ కు 8,000 రూపాయలు చెల్లించి, కొనుగోలు చేసి వాటిని మిర్యాలగూడ పట్టణానికి చెందిన శ్రీ సూర్యా ఆసుపత్రి డాక్టర్ అశోక్ కుమార్ కు ఒక్కో బాటిల్ 23,000 వేల రూపాయలకు గణపతి రెడ్డి నుండి కొనుగోలు చేసేవారని తెలిపారు. శ్రీ సూర్యా ఆసుపత్రి పిఆర్వోగా ఉన్న శ్రీనివాస్ వీటిని హైదరాబాద్ నుండి తీసుకువచ్చే వాడని ..ఆ తర్వాత తమ ఆసుపత్రిలో కరోనా చికిత్స కోసం జాయిన్ అయ్యే పేషేంట్ల పరిస్థితి, వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఒక్కో బాటిల్ 35,000 రూపాయల నుండి 50,000 వరకు విక్రయించారని చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 138 బాటిల్స్ శ్రీ సూర్యా ఆసుపత్రికి గణపతి రెడ్డి ద్వారా సరఫరా జరిగిందని వివరించారు. ఈ కేసులో రెండు రోజుల క్రితం శ్రీ సూర్యా ఆసుపత్రి డాక్టర్ అశోక్ కుమార్ తో పాటు.. మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించగా.. సోమవారం రోజున హెటిరో మేనేజర్ బాలకృష్ణ, అతని స్నేహితుడు గణపతి రెడ్డిలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు డీఐజీ రంగనాధ్. ఈ కేసులో సమర్ధవంతంగా పని చేసిన మిర్యాలగూడ డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, టాస్క్ ఫోర్స్ సిఐలు ఎస్.ఎం. బాషా, బాలగోపాల్, మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ సదా నాగరాజు, వన్ టౌన్ సిబ్బందిని డీఐజీ రంగనాధ్ ప్రత్యేకంగా అభినందించారు.
రేమిడిసివర్ బ్లాక్ దందా.. హెటిరో మేనేజర్, మరో వ్యక్తి అరెస్ట్
- హైదరాబాద్
- May 11, 2021
లేటెస్ట్
- బీజేపీ అంటే బ్రిటీష్ జనతాపార్టీ..మోదీ కాలనాగులాంటోడు: సీఎం రేవంత్రెడ్డి
- బీజేపీ తెలంగాణకు అక్కరకు రాని చుట్టము : కేసీఆర్
- బరువు తగ్గాలని ఆపరేషన్.. ఆ తర్వాత చనిపోయిన యువకుడు
- Krunal Pandya: తండ్రైన కృనాల్ పాండ్య.. ఏం పేరు పెట్టారంటే..?
- VD12 Movie: పాటల్లేకుండా అనిరుధ్ - జెర్సీ డైరెక్టర్ సినిమా..ఆడియన్స్ ఊహించుకోగలరా?
- గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు
- షాద్నగర్ అగ్నిప్రమాదం.. ఈ పిలగాడు 50మందిని కాపాడిండు
- అధిక ధరకు ఐపీఎల్ టికెట్ల విక్రయం .. ఇద్దరు అరెస్ట్
- KKR vs PBKS: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న పంజాబ్.. ఓడితే ఇంటికే
- కేసీఆర్, కేటీఆర్ శవ రాజకీయాలు చేస్తున్నారు.. పొన్నం ప్రభాకర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- భార్య వారసత్వ ఆస్తిని వాడుకుంటే.. భర్త తిరిగి చెల్లించాలి : సుప్రీంకోర్టు