తెలంగాణ జాబ్స్ స్పెషల్ : ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ

తెలంగాణ జాబ్స్ స్పెషల్ : ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ

రిపోర్టర్స్​ వితవుట్​ బోర్డర్స్​ సంస్థ 21వ ఎడిషన్​ వరల్డ్​ ప్రెస్​ ఫ్రీడమ్​ ఇండెక్స్​– 2023 నివేదికను విడుదల చేసింది. 

 - వరల్డ్​ ప్రెస్​ ఫ్రీడమ్​ ఇండెక్స్​– 2023 లో 180 దేశాలకుగాను భారత్​ 161వ స్థానంలో నిలిచింది. జర్నలిస్టుల పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉన్న 31 దేశాల జాబితాలో భారత్​ కూడా ఉందని రిపోర్టర్స్​ వితవుట్​ బోర్డర్స్​ తన తాజా నివేదికలో పేర్కొంది. 

 - ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ – 2023లో నార్డిక్​ దేశాలైన నార్వే, ఐర్లాండ్​, డెన్మార్క్​ తొలి మూడు స్థానాల్లో నిలవగా వియత్నాం, చైనా, ఉత్తరకొరియా చివరి మూడు స్థానాల్లో ఉన్నాయి. 

రిపోర్టర్స్​ వితవుట్​ బోర్డర్స్​ అనే గ్లోబల్​ మీడియా వాచ్​డాగ్​ ప్రతి ఏడాది ప్రపంచ మీడియా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా ఈ స్వేచ్ఛా సూచీని ప్రచురిస్తుంటుంది. మొత్తం 180 దేశాలకు ర్యాంకులను కేటాయిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్​ రాజధాని పారిస్ నగరంలో ఉంది. దీనికి ఐక్యరాజ్య సమితి కన్సల్టేవ్​ హోదా ఉంది.