పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్నగర్ సెంటర్లో కేంద్ర మాజీ మంత్రి, స్వర్గీయ గడ్డం వెంకటస్వామి(కాకా) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మహనీయుల ఆశయసాధన సంఘం నాయకులు, కాకా అభిమానులు శుక్రవారం కలెక్టరేట్లో అధికారులకు వినతిపత్రం అందజేశారు. వెంకటస్వామి పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుంచి 4 సార్లు ప్రాతినిధ్యం వహించి ఎన్నో సేవలు చేశారన్నారు.
బడుగు, బలహీన వర్గాలు, కార్మికులు, పేదల పక్షాన పోరాడిన మహానేత కాకా అని, అలాంటి మహానాయకుడి విగ్రహం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి గౌరవించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మహనీయుల ఆశయసాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బొంకూరి కైలాసం, బాలసాని సతీశ్గౌడ్, బోడకుంట సతీశ్, ఆరెపల్లి రాహుల్, పైడ తిరుపతి, మహేశ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
