హైదరాబాద్, వెలుగు: సీతాఫల్మండిలో మంచి కండీషన్లో ఉన్న 27 గదుల గవర్నమెంట్ స్కూల్ను సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కూలగొట్టి జూనియర్ కాలేజ్ నిర్మిస్తున్నారని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి మండిపడ్డారు. సోషల్ డెమొక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి బుధవారం ఫోరం కో కన్వీనర్ పృథ్విరాజ్, సేవ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రొ.లక్ష్మినారాయణతో కలిసి స్కూల్ను పరిశీలించారు.
జూనియర్ కాలేజ్ నిర్మాణం కోసం సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి పద్మారావు గౌడ్ రూ.29 కోట్లు శాంక్షన్ చేయించుకున్నారని ఆకునూరి మురళి విమర్శించారు. 27 రూమ్స్ ఉన్న మూడు బిల్డింగ్లను రిపేర్ చేసే అవకాశం ఉన్నా కూలగొట్టారని ఆరోపించారు. బిల్డింగ్ నిర్మాణానికి ఇంకా టెండర్లు పిలవలేదన్నారు. హెచ్ఎంకు సమాచారం ఇవ్వకుండా స్కూల్ కూలగొట్టారని ఫైర్ అయ్యారు.