టీటీడీ బోర్డు ఈవో పడే బాధ వర్ణనాతీతం: ఐవైఆర్

టీటీడీ బోర్డు ఈవో పడే బాధ వర్ణనాతీతం: ఐవైఆర్

టీటీడీ బోర్డుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. 29 మంది సభ్యులతో ఉన్న బోర్డును నిర్వహించడంలో ఈవో పడే బాధ వర్ణనాతీతమని ట్విట్ చేశారు. ఇక భక్తి భావాలు కలిగిన వాళ్ళు బోర్డులో ఉండాలంటే అది ఏ నాడూ జరగలేదన్నారు. ఇప్పుడైనా, భవిష్యత్తులోనైనా జరుగుతుందన్న ఆశ కూడా లేదన్నారు. టీటీడీ బోర్డుపై తానేమంటానని తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని అన్నారు. టీటీడీ వ్యవస్థలో నిర్ణయాలు ఈవో, చైర్మన్, సీఎం మధ్య నడుస్తాయన్నారు. బోర్డు సభ్యులు దర్శనాలకు మాత్రమే చేసుకుంటారన్నారు.