టీటీడీ బోర్డుపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. 29 మంది సభ్యులతో ఉన్న బోర్డును నిర్వహించడంలో ఈవో పడే బాధ వర్ణనాతీతమని ట్విట్ చేశారు. ఇక భక్తి భావాలు కలిగిన వాళ్ళు బోర్డులో ఉండాలంటే అది ఏ నాడూ జరగలేదన్నారు. ఇప్పుడైనా, భవిష్యత్తులోనైనా జరుగుతుందన్న ఆశ కూడా లేదన్నారు. టీటీడీ బోర్డుపై తానేమంటానని తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారని అన్నారు. టీటీడీ వ్యవస్థలో నిర్ణయాలు ఈవో, చైర్మన్, సీఎం మధ్య నడుస్తాయన్నారు. బోర్డు సభ్యులు దర్శనాలకు మాత్రమే చేసుకుంటారన్నారు.
29 సభ్యుల బోర్డును మేనేజ్ చేయటం లో ఈవో పడే బాధ వర్ణనాతీతం. ఇక భక్తి భావాలు కలిగిన వాళ్ళు బోర్డులో ఉండాలంటే అది ఏ నాడూ జరగలేదు. ఇప్పుడైనా భవిష్యత్తులోనైనా జరుగుతుందన్న ఆశ లేదు. స్వామి గారి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా దేవాలయాలకు ప్రభుత్వం నుంచి విముక్తి వస్తేనే ముక్తి ఉంటుంది
— IYRKRao , Retd IAS (@IYRKRao) September 19, 2019