రిక్షా పుల్లర్‌కు పీఎంవో నుంచి లెటర్

రిక్షా పుల్లర్‌కు పీఎంవో నుంచి లెటర్

ఎవరైనా సరే తమ కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. జరిగితే అదృష్టంగా భావిస్తారు. లేకపోతే లైట్ తీసుకుంటారు. అలాంటి అదృష్టమే ఓ రిక్షాపుల్లర్‌కు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మంగల్ కేవాత్ రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తన కూతురు పెళ్లికి ప్రధాని నరేంద్ర మోడీని పిలవాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా .. తన కూతురి పెళ్లి కార్డును ఢిల్లీలోని పీఎంవోకు వెళ్లి ఇచ్చాడు. కార్డయితే ఇచ్చాం కానీ.. తమ లాంటి పేదవాళ్లను పట్టించుకుంటారా అని మంగల్ కేవాత్ అనుకున్నాడు. కానీ, అతను ఊహించని విధంగా ఫిబ్రవరి 8న ప్రధాని మోడీ నుంచి లెటర్ వచ్చింది. మంగల్ కేవాత్ కూతురి పెళ్లికి శుభాకాంక్షలు తెలుపుతూ లెటర్ వచ్చింది. అది చూసిన మంగల్ కేవాత్ కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబయింది. ‘మాకు మళ్లీ ఇలా లెటర్ వస్తుందని అసలు ఊహించలేదు. సమాజంలోని ప్రతి ఒక్కరినీ ప్రధాని పట్టించుకుంటారనడానికి ఈ లెటర్ నిదర్శనం. ఈ లెటర్ మా కుటుంబానికి ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది’ అని కేవాత్ అన్నారు. త్వరలో ఉత్తర ప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోడీని కలిసి తమ కష్టాలు చెప్పుకుంటామని కేవాత్ భార్య రేణు దేవీ తెలిపారు.