సోనియమ్మ మాల వేస్కుందం : రేవంత్ రెడ్డి

సోనియమ్మ మాల వేస్కుందం : రేవంత్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల కోసం ఓ వంద రోజులు కేటాయించాలని పార్టీ నాయకులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అయ్యప్ప, శివ మాలధారణలాగా.. కాంగ్రెస్ దీక్ష తీసుకుందామన్నారు. సోనియమ్మ మాల వేసి కష్టపడదామని కోరారు. 90 లక్షల ఓట్లు తెచ్చుకుంటే 90 సీట్లు గెలవడం పెద్ద లెక్కకాదన్నారు. 

శనివారం హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జిల్లా, మండల, బ్లాక్ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీసీసీ వర్కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన, సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో రేవంత్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి మాణిక్ రావ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఠాక్రే, భట్టి విక్రమార్క తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు.  

మండలాధ్యక్షుల పాత్ర కీలకం: ఠాక్రే

పార్టీ నిర్మాణంలో మండలాధ్యక్షుల పాత్ర కీల కమని మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఇంతకాలం కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేసిన మండలాధ్యక్షులు రాబోయే ఎన్నికల్లో మరింత కీలకంగా పనిచేయాలని కోరారు. మండలాధ్యక్షుల కృషి వల్లే కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు.