కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి చాలా మంది చూస్తున్నారని.. ఎవరు వచ్చినా పార్టీలో సీనియర్ల నుంచి కింది స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తీసుకునే చేర్చుకుంటామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. జూన్ 21న ఆయన ఎంపీ కోమటి రెడ్డి వెంకట్రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరికల అంశం చర్చకు వచ్చింది.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చేరికకు పలువురు కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వేళ.. అలాంటిదేమీ లేదని రేవంత్చెప్పారు. నేతలెవరు చేరినా కాంగ్రెస్లో అందరి అభిప్రాయాలు తీసుకునే చేర్చుకుంటామన్నారు. కోమటి రెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి ఇలా పొంగులేటి చేరిక విషయంలో అందరి అభిప్రాయం తీసుకున్నామన్నారు. నేతల భేటీ అనంతరం జూపల్లి కృష్ణారావు ఇంటికి నేతలు బయల్దేరారు. మరి కాసేపట్లో జూపల్లితో భేటీ జరగనుంది.
బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది..: జూపల్లి
సీఎం కేసీఆర్ పాలనపై రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. జూపల్లి నివాసంలో ఆయన మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలన చాలని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు.