కేసీఆర్.. నాపై పోటీ చేయ్

కేసీఆర్.. నాపై పోటీ చేయ్

నాపై పోటీకి అభ్యర్థులను వెతికే బదులు నువ్వే పోటీకి రా చూసుకుందామని సవాల్ విసిరారు. మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్‍ అభ్యర్థి రేవంత్ రెడ్డి. ఎల్బీనగర్లోని చంద్రపురి కాలనీలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయాన్ని మాజీ  ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. రేవంత్‍ మాట్లాడుతూ మల్కాజిగిరిలో కాంగ్రెస్‍ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. గడప గడపకు కేసీఆర్ నియంతృత్వ పాలనను వివరించాలన్నారు . పార్టీ మారుతున్న సబితారెడ్డి, సుధీర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు . తన నియోజకవర్గంలో తనపైదాడులు జరుగుతున్నా సుధీర్ రెడ్డికి ప్రచారం చేశానన్నారు . కూన శ్రీశైలంగౌడ్, మల్ రెడ్డి రామిరెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, కొప్పుల నర్సిం హారెడ్డి, దేప భాస్కర్ రెడ్డి, చిలుక మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు . శ్రీగణేష్‍ ఇంటికి… సికింద్రాబాద్: బీజేపీ నాయకుడు శ్రీగణేష్ ఇంటికి మంగళవారం రేవంత్ రెడ్డి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటివి ఉండవని ,పార్లమెంట్ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిం చారు. కాం గ్రెస్ లో చేరేది లేదని కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని శ్రీగణేష్ పేర్కొన్నారు . సంకీరవీందర్, వెంకటేశ్, బలవంత్ రెడ్డి పాల్గొన్నారు .