
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.లక్షల కోట్ల అవినీతి చేసిన సీఎం కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని టీపీసీసీ రేవంత్రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా అనిల్కుమార్యాదవ్ప్రమాణ స్వీకారం చేయడగా ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ని చిత్తుగా ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
డిసెంబర్లో ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ సీనియర్నేత సోనియా గాంధీ పుట్టిన రోజు ఉన్నందున ఆమెకు కానుకగా తెలంగాణలో కాంగ్రెస్ని గెలిపించి గిఫ్ట్గా ఇవ్వాలని ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్లేకపోతే తెలంగాణ ఉద్యమం పుట్టకపోయి ఉండేదన్న కేటీఆర్వ్యాఖ్యలకు రేవంత్రెడ్డి కౌంటర్ఇచ్చారు. మంత్రి కేటీఆర్కి చరిత్ర తెలియదని, కేంద్రంలో అధికారం కోల్పోయినా, ఏపీలో చీకటిలో కలిసిన తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం సోనియాగాంధీ రాష్ర్టాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. డబల్బెడ్రూం ఇళ్లు ఇచ్చిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఓట్లడగాలని, ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓట్లడుగుతుందని అన్నారు.