హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో సోమవారం నుంచి వరుసగా మూడు రోజుల పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించను న్నారు. ఆదివారం దీపావళి పండుగ కావడంతో బ్రేక్ఇచ్చారు.
సోమవారం కొడంగల్లో ప్రచారం నిర్వహించ నున్న ఆయన.. మంగళవారం స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, కామారెడ్డిల్లో ప్రచారం చేయనున్నారు. అదే రోజు వివిధ మండలాల లీడర్లతో సమావేశా లు నిర్వహించనున్నారు. బుధవారం బోథ్, నిర్మల్, జనగామల్లో జరిగే పార్టీ బహిరంగ సభల్లో పాల్గొననున్నారు.