అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలపై సంతకం పెడుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. 45 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని..కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు చేసిన వారి సంగతి తేలుస్తామన్నారు. బీఆర్ఎస్ కు సహకరించి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టిన అధికారులకు మిత్తితో సహా ఇస్తామని హెచ్చరించారు.
మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ కు సాయం చేసే వారిని బెదిరిస్తున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ కు అండగా ఉండేవారు, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకునే 75 మంది జాబితాను మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు ఇచ్చారని ఆరోపించారు. వాళ్ల మీద నిఘా పెట్టాలని సూచించారన్నారు. కేటీఆర్ కొంత మంది కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కు సపోర్ట్ చేసే వారిని పిలిచి బెదిరిస్తున్నారని..ఆయనకు 45 రోజుల తర్వాత మిత్తితో సహా అప్పగిస్తామని హెచ్చరించారు.
గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో తాండూరు మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ సునీత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కాండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.