రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం.. ఇకపై ఎలక్ట్రికల్వెహికిల్స్!

రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం.. ఇకపై ఎలక్ట్రికల్వెహికిల్స్!
  • ప్రభుత్వ వాహనాలు క్రమంగా ఈవీ వైపు!
  • తన కాన్వాయ్ సహా అన్ని డిపార్ట్​మెంట్స్​కు ఎలక్ట్రిక్ 
  • వాహనాలే​ కొనాలని సీఎం ఆదేశాలు  
  • వివిధ డిపార్ట్​మెంట్లలో లక్ష దాకా ఫోర్​ వీలర్స్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం ఇకపై ఎలక్ట్రికల్​వెహికిల్స్(ఈవీ) మాత్రమే కొనాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న డీజిల్, పెట్రోల్​వెహికల్స్​ను వినిగిస్తూనే కొత్తగా అవసరమైన చోట ఈవీలు కొనాలని, తన కాన్వాయ్​సహా అన్ని డిపార్ట్​మెంట్లకూ ఇది వర్తిస్తుందని సీఎం రేవంత్​ రెడ్డి ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. 

ప్రభుత్వ అధికారులు ఉపయోగించే అద్దె వాహనాలు సైతం ఎలక్ట్రిక్​వే ఉండాలని స్పష్టం చేశారు. ఇరాన్​, ఇజ్రాయెల్​యుద్ధంతో పెట్రోల్, గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకున్నది. కాగా, సరిపడా చార్జింగ్​ స్టేషన్లు లేకపోవడమే ఈవీ వెహికల్స్​కు సమస్యగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,062 ఈవీ చార్జింగ్​ స్టేషన్లు ఉండగా.. మరో 1,500 ఈవీ చార్జింగ్​ స్టేషన్లకు సంబంధించిన అప్లికేషన్లు రెడ్​కో దగ్గరే పెండింగ్​ఉన్నాయి. 

ప్రభుత్వ వినియోగంలో లక్ష దాకా ఫోర్​వీలర్స్​ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల పరిధిలో సుమారు 50 వేలకు పైగా ఫోర్​వీలర్స్​ వినియోగిస్తోంది. ప్రభుత్వ అధికారులు ఉపయోగించే అద్దె వాహనాలు మరో 50 వేలకు పైగా ఉంటాయి. సీఎం రేవంత్​ ఆదేశాల ప్రకారం వీటన్నింటినీ భవిష్యత్​లో ఈవీ వెహికల్స్​గా మారిస్తే మెయింటనెన్స్​ తగ్గడంతో పాటు ప్రభుత్వానికి డీజిల్, పెట్రోల్​ఆదా రూపంలో వందల కోట్లు కలిసివస్తాయని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోనూ ఈవీ వెహికల్స్​ క్రమంగా పెరుగుతున్నాయి. 

2024తో పోల్చితే 2025 క్యాలెండర్​ ఇయర్​లో  ఈవీ ఫోర్ వీలర్స్​ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2024లో ఈవీ కార్లు 1,943 ఉండగా.. 2025 జనవరి నుంచి డిసెంబర్​ 31 వరకు కొత్తగా 19,965 ఈవీ కార్లు రిజిష్టర్ అయినట్టు రికార్డులు చెబుతున్నాయి. ప్రభుత్వం ఈవీ వెహికల్స్​కు రోడ్​ ట్యాక్స్​, రిజిస్ట్రేషన్​ ఫీజులో వంద శాతం రాయితీ ఇవ్వడంతో ఒక ఏడాదిలోనే ఈవీ వెహికల్స్​ పదిరెట్ల పెరిగాయి.  

కాగా, పెరుగుతున్న ఈవీ వెహికల్స్​ అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్రంలో ఈవీ చార్జింగ్​ స్టేషన్లు లేవు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 1,062 ఈవీ చార్జింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేయగా, ప్రభుత్వ పరిధిలో 150 ఉండగా, మిగిలినవన్నీ ప్రైవేట్​ఆధ్వర్యంలో నడుస్తున్నాం. 2030 నాటికి 6 వేలకు, 2035 నాటికి 12 వేల వరకు ఈవీ స్టేషన్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. నేషనల్​ హైవే రోడ్లపై ప్రతి 25, -30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఈవీ చార్జింగ్​ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.