డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ కుటుంబం శాశ్వతంగా ఫామ్ హౌజ్ కే పరిమితం అవుతుందన్నారు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా పరిగి బస్సు యాత్రలో మాట్లాడారు రేవంత్. రాష్ట్రంలో వేల ఎకరాల భూములు ఆక్రమించిన కేసీఆర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ను ప్రజలు తిరస్కరిస్తారని చెప్పారు.
కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. ఆయన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శించారు. ఆయన మనువడు చిన్నగ ఉన్నాడు కాబట్టి ఏ పదవి ఇయ్యలేదన్నారు. ఆంధ్రోడు లేడు పగోడు లేడని.. కేసీఆరే తెలంగాణకు పెద్ద శని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు.
గుడిలో లింగాన్ని మింగే నాయకుడు పరిగి ఎమ్మెల్యే అని రేవంత్ ఆరోపించారు. ఆయనను కూడా ఇంటికి పంపాలన్నారు. తెలంగానలో అవినీతి పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని తెలంగాన ఇచ్చిన సోనియాకు శుభాకాంక్షలు తెలపాలన్నారు రేవంత్.