తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. కర్నాటక స్కీంలపై కేసీఆర్ కు సవాల్ విసిరారు శివకుమార్. కేసీఆర్ కర్ణాటక వస్తే అమలవుతున్నాయో లేదో.. దగ్గరుండి చూపిస్తామన్నారు శివకుమార్. రంగారెడ్డి జిల్లా పరిగిలో రెండో విడుత బస్సు యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు డీకే శివకుమార్. పదేళ్లయినా తెలంగాణ కేసీఆర్ హామీలను నెరవేర్చలేదని.. తాము కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఐదు గ్యారెంటీలను అమలు చేశామన్నారు.
గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ప్రతి మహిళకు నెలకు రూ2 వేలు ఇస్తున్నామన్నారు. కావాలంటే కర్ణాటకకు వస్తే చూపిస్తామన్నారు. తాము ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామో లేదో చూపిస్తామని కేసీఆర్,కేటీఆర్ కు సవాల్ విసిరారు. తేదీ, సమయం చెబితే బస్సులో కర్ణాటక తీసుకెళ్లి నిరూపించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.