అమరుల స్థూపం నిర్మాణంపై విచారణ కమిటీ వేయాలి

అమరుల స్థూపం నిర్మాణంపై విచారణ కమిటీ  వేయాలి

అమరుల స్థూపం కట్టడానికి తెలంగాణ వాళ్లుపనికి రారా? అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  అమరుల స్థూపం కట్టడానికి కూడా పొద్దుటూరు వాళ్లకు కాంట్రాక్ట్  ఇచ్చారన్నారు. ఆంధ్రా కాంట్రాక్టర్ కు ఇచ్చి అమరుల గుండెల్లో గుణపాలు దించారన్నారు.  అయినా అధికార పార్టీ ధనదాహం తీరడం లేదన్నారు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల కోసమే అమరుల  స్థూపం నిర్మాణం ఆంధ్రావాళ్లకు ఇచ్చారన్నారు. ఈ టెండర్ కేపీసీ ప్రాజెక్ట్ లిమిటెడ్ కు ఇచ్చిందన్నారు. ఈ కంపెనీ  పొద్దుటూరుకు చెందిన వ్యక్తిదేదన్నారు. 6 శాతం కన్సల్టెంట్ ఫీజు ఇస్తుందన్నారు.రేకులు ..ఇనుముతో కట్టిన నిర్మాణానికి 177 కోట్లకు పెంచారన్నారు.  60 కోట్లతో మొదలైన స్థూపం.. రూ.180 కోట్లకు  పెంచారన్నారు. కేటీఆర్ ను మెప్పించి  వ్యయం పెంచుకున్నాడన్నారు. 300 శాతం బడ్జెట్ పెంచారన్నారు. అమరుల స్థూపం దుస్థితి చూస్తే బాధేస్తుందన్నారు. అసలు కేసీఆర్ తెలంగాణ బిడ్డేనా? డీఎన్ఏ టెస్టు చేయించాలన్నారు. నాలుగేళ్లైనా అమరుల స్థూపం ఎందుకు పూర్తికాలేదో విచారణ కమిటీ వేయాలన్నారు.  కమిటీ వేసి ఆలస్యానికి కారకులైన వారిపై   క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.  ఆంద్రా కాంట్రాక్టర్ కు ఇవ్వడానికి కారణం ఏంటి? తెలియాలన్నారు. ఈ అవినీతికి  కేటీఆర్, అతని  ఫ్రెండ్ తెలుకుంట శ్రీధరే కారణమన్నారు రేవంత్.