హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ చెబుతున్న బంగారు తెలంగాణ రైతులకు బతుకునివ్వలేక పోతున్నదని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రైతు ఆత్మహత్యలపై వెలుగులో వచ్చిన వార్తలను రేవంత్ సోమవారం ట్విటర్లో పోస్టు చేశారు. "నువ్విస్తున్నానని చెబుతున్న రైతుబంధు రైతుల ప్రాణాలను కాపాడలేకపోతోంది.
నువ్వు చేశానని చెబుతున్న బంగారు తెలంగాణ రైతులకు బతుకునివ్వలేకపోతోంది. చనిపోయాక ఇచ్చే రైతుబీమా కాదు.. బతికుండడానికి భరోసా ఏది కేసీఆర్!?" అంటూ రేవంత్ తన ట్వీట్లో పేర్కొన్నారు.