గాంధీభవన్ మెట్లపై ఆందోళనకు దిగితే పార్టీ నుంచి సస్పెండ్.. :రేవంత్ రెడ్డి

గాంధీభవన్ మెట్లపై ఆందోళనకు దిగితే పార్టీ నుంచి సస్పెండ్.. :రేవంత్ రెడ్డి

హైదరాబాద్: గాంధీభవన్ మెట్లపై ఆందోళనకు దిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండల పార్టీ అధ్యక్షుడి నియామకాన్ని నిరసిస్తూ పలువురు ఇవాళ ఉదయం గాంధీ భవన్ కు చేరుకొని చేతిలో ప్లకార్డులు పట్టుకొని ధర్నాకు ఉపక్రమించారు. 

దీనిపై సీరియస్ అయిన పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి తుర్కపల్లి మండల నాయకులు వెంటనే ధర్నా విరమించాలని నియోజకవర్గ ఇన్ చార్జి బీర్ల ఐలయ్యకు సూచించారు. లేని పక్షంలో పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. నియోజకవర్గంలోని 8 మండలాలకు గాను ఏడిటింని ఐలయ్యకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ఇచ్చామని రేవంత్ చెప్పారు. 

మొన్నటి వరకు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న శంకర్ నాయక్ ను సస్పెండ్ చేయాలని రేవంత్ ఆదేశించారు. ఈ క్రమంలో గాంధీభవన్ మెట్లపై ఎవరెరు ధర్నాకు దిగారో సమాచారాన్ని పీసీసీ సేకరిస్తున్నది.