అన్యాయంగా  వీర శేఖర్‌‌పై  థర్డ్ డిగ్రీ

అన్యాయంగా  వీర శేఖర్‌‌పై  థర్డ్ డిగ్రీ

టీఆర్ఎస్ పాలనలో  మావన హక్కులు  ఉరికొయ్యకు  వేలాడుతున్నాయన్నారు పీసీసీ  చీఫ్  రేవంత్ రెడ్డి.  మరియమ్మ, శీలం  రంగయ్య  పోలీసుల చిత్రహింసలకు  బలీ అయ్యారన్నారు  రేవంత్ రెడ్డి. ఇలాంటి   దారుణాలపై  హైకోర్టు కన్నెర్ర  చేస్తున్న టైమ్ లోనే  వీర శేఖర్ పై  అన్యాయంగా  థర్డ్ డిగ్రీ  ప్రయోగించారని  ఆవేదన వ్యక్తం  చేశారు. కేసీఆర్ ఇది ప్రజాస్వామ్యమా.. ఆటవిక రాజ్యమా  అంటూ ట్విట్టర్ లో  ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. నిన్న సూర్యాపేట జిల్లాలో  రామోజీ తండాకు చెందిన గుగులోతు వీరశేఖర్‌ అనే గిరిజన యువకుడిపై పోలీసులు థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించారు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి.

మరిన్ని వార్తల కోసం: 

పోలీసులు కొట్టడంతోనే నా భర్త చనిపోయాడు

సారీ.. ఇద్దరి కోసం పరీక్ష పెట్టమనలేం