రెవెన్యూ సదస్సులతో భూసమస్యలు పరిష్కారం

రెవెన్యూ సదస్సులతో భూసమస్యలు పరిష్కారం

తుంగతుర్తి, నల్గొండ అర్బన్, హుజూర్ నగర్, వెలుగు : రెవెన్యూ సదస్సులతో భూసమస్యలు పరిష్కారమవుతాయని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ పి.రాంబాబు సూచించారు. శుక్రవారం నూతనకల్ మండలం తాళ్లసింగారంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో  ఆయన పాల్గొని మాట్లాడారు. జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు కొనసాగుతాయని తెలిపారు. 

ఈ సదస్సుల్లో రైతులు తమ భూసమస్యలపై దరఖాస్తులు అధికారులకు సమర్పించాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. మరోవైపు తిప్పర్తి మండలం కంకణాలపల్లి గ్రామం, హుజూర్ నగర్ మండలం అమరవరం, అంజలి పురం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది, రైతులు
 పాల్గొన్నారు.